BIKKI NEWS (JULY 13) : JL to Principal promotions on July 14th. తెలంగాణ రాష్ట్రలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ పదవులకు 81 మంది జూనియర్ లెక్చరర్ల పదోన్నతికై కౌన్సెలింగ్ జూలై 14న నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది.
JL to Principal promotions on July 14th
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 81 మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లను ప్రిన్సిపాల్లుగా పదోన్నతి ఇవ్వడం కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నది. ఈ కౌన్సెలింగ్ జూలై 14, 2025 న హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో జరగనుంది.
పదోన్నతికి ఎంపికైన అన్ని జూనియర్ లెక్చరర్లు తప్పనిసరిగా కౌన్సెలింగ్కు సమయానికి హాజరుకావాలని, ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు నేతృత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టినట్టు ప్రకటించింది.
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
- Today Gold Rate August 6th 2026 – భారీగా పెరిగిన బంగారం ధర
- Hiroshima Day – హిరోషిమా దురంఘతం ఆగస్టు 06
