BIKKI NEWS (NOV. 27) : Telangana 10th exams in new pattern. తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నూతన పద్దతిలో నిర్వహించనున్నారు. మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి.
Telangana 10th exams in new pattern
ఒక్కో పరీక్ష మధ్య ఒకటి లేదా రెండు రోజుల వ్యవధి ఇవ్వాలని ప్రతిపాదించారు.
దీంతో విద్యాశాఖ రెండు, మూడు రకాల షెడ్యూళ్లను రూపొందించారు .
సీబీఎస్ఈ నిర్వహిస్తున్న కొన్ని పరీక్షలకు వారం రోజుల వ్యవధి కూడా ఉంటోంది. అదే విధానాన్ని తెలంగాణలో పదో తరగతికి అమలు చేయాలని ప్రతిపాదించారు
ఒక పరీక్ష కు మరో పరీక్షకు మధ్య ఒకటి, రెండు రోజుల వ్యవధి ఉండటం వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకుంటారని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పదో తరగతి పరీక్షల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

